వైఎస్ జగన్ ఫ్యామిలీపై నటి పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్

-

గత ఐదేళ్లు ఏపీలో సాగించిన అరాచక పాలనతో వైసిపి బీభత్సం సృష్టించింది.దీంతో ఆ పార్టీ ఎన్నికల ఫలితాల్లో కనీవిని ఎరగని రీతిలో ఓటమి పాలయింది.వైఎస్ జగన్‌ నియంతృత్వ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడుతూ.. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టారు.దీంతో కూటమి దెబ్బకు వైసిపి పార్టీ అడ్రస్ లేకుండా పోయింది.ఎన్డీఏ కూటమిలోని టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. 175 సీట్లకు గాను ఎన్డీయే కూటమి 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇక ఈ నేపథ్యంలో నటి పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబం మొత్తం కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు నటి పూనమ్ కౌర్ తెలిపారు. ‘గత ఎన్నికల్లో జగన్ విజయానికి భార్య భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిలది కీలకపాత్ర. వారు తమదైన మార్గాల్లో సహనం, పట్టుదలను నేర్పారు. ఇప్పుడు వారంతా కలిసుండాలని కోరుకుంటున్నా’ అని కౌర్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version