బంధాల్లో కంటే ఒంటరిగా ఉండటం బెటర్… హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్

-

‘జయం’ సినిమాతో నటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె ‘దొంగా దొంగది’, ‘అవునన్నా కాదన్నా’,‘అపరిచితుడు’ లాంటి చిత్రాల ద్వారా తెలుగువారికి చేరువయ్యారు. విభిన్న కథాంశాలతో రూపొందిన చిత్రాల్లో నటించి వివిధ కార్యక్రమాల్లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించి తెలుగువారికి ఎంతో దగ్గరైంది హీరోయిన్ సదా.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలో వ్యక్తిగత బంధాల పై ఆమె చేసిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

‘‘మనలో చాలా మంది వారికి ఇష్టమైన వ్యక్తులను కోల్పోతారేమో అని భయపడుతుంటారు. ఒకప్పుడు మీకు చాలా సన్నిహితంగా ఉన్నవారు కూడా ఒక్కొక్కసారి మీకు సహకరించరు. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్న వారు మాత్రమే మీకు పూర్తిగా సహకారం అందించగలరు. మీ ఎదుగుదలకు అడ్డువచ్చే వ్యక్తులను సున్నితంగా తిరస్కరించడం మేలు.

మీరు ఒకరి కోసం త్యాగాలు చేసినా గుర్తింపు రాకపోతే మీ అంతరాత్మ చెప్పే మాట వినండి. ఎందుకంటే మన జీవితంలోకి రకరకాలైన మనుషులు వచ్చి పోతుంటారు. కానీ చివరి వరకు మనతో ఉండేది మనం మాత్రమే. ఒకరి నుంచి సంతోషాన్ని ఆశించ వద్దు. అలా చేస్తే మీకు మీరే హాని చేసుకున్న వారవుతారు’’.

‘‘మన ఇంట్లో అవసరం లేని వస్తువులను ఎలా అయితే బయటపడేసి శుభ్రం చేసుకుంటామో.. అలానే మన జీవితాల్లో నుంచి కూడా కొందరిని తీసేసి మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి. జీవితం చాలా చిన్నది బలవంతంగా బంధాల్లో ఉండడం కంటే ఒంటరిగా సంతోషంగా ఉండడం మంచిది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version