నువ్వు ఇంక వెళ్ళవా.. అంటూ సుధీర్ ను అవమానించిన ఆది..కారణం..?

-

బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో కామెడీ షోలు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయని చెప్పవచ్చు. ఇక ఈ కార్యక్రమాల ద్వారా కమెడియన్ సుడిగాలి సుధీర్ ఏ రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.. నిజానికి ఈయన ముందుగా మెజీషియన్ గా అవతారం ఎత్తి.. ఆ తర్వాత స్క్రిప్ట్ రైటర్ గా, కమెడియన్ గా తనలో ఉన్న ప్రతిభను బయటపెట్టారు. ప్రస్తుతం ఒక కమెడియన్ గా , డాన్సర్ గా కూడా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. సుధీర్ నిజానికి గత తొమ్మిది సంవత్సరాల నుండి తన టాలెంట్ నిరూపించుకునీ.. తన టీం తో కలిసి చేసే ఎన్నో స్కిట్లు ప్రేక్షకులను బాగా అలరిస్తూ వచ్చాయి. ఇకపోతే ఉన్నట్టుండి ఆయన జబర్దస్త్ నుంచి దూరం కావడంతో రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు టీఆర్పి రేటింగ్ కూడా పడిపోయిందని చెప్పవచ్చు.

ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరించినా.. ఆ కార్యక్రమం నుంచి కూడా తప్పుకున్నాడు. ఇక ఎన్నో ఈ టీవీ కార్యక్రమాల ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుధీర్.. ప్రస్తుతం మల్లెమాల వారి నిర్మాణంలో వస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలకు దూరమయ్యారని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఈటీవీ ని వదిలి స్టార్ మా కు పరిమితమయ్యారు. ఇకపోతే తాజాగా ఈటీవీ 27వ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా భలే మంచి రోజు అనే కార్యక్రమం ద్వారా సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఆదివారం ప్రసారం కాబోతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రోమో కూడా విడుదల చేశారు. ఇక ఈ ప్రోమోలో అనసూయ , సుధీర్ ఇద్దరూ కూడా హాజరైనట్లు తెలుస్తోంది.ఇక ఎప్పటిలాగే హైపర్ ఆది.. సుధీర్ పై సెటైర్లు వేస్తూ తన పరువు మొత్తం తీసేసారు.. ఒక స్కిట్లో భాగంగా సర్ మనకి బ్రేక్ అంటూ ఎప్పుడూ ఉండదా అంటూ సుధీర్ అనగా.. మేము నీకు ఎప్పుడో బ్రేక్ ఇచ్చేసాము. అయినా నువ్వే ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నావు.. ఇంక వెళ్ళవా అంటూ సుధీర్ పై తనదైన శైలిలో పంచ్ వేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా విపరీతంగా వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version