నాకు రాంగ్ గైడెన్స్ ఇచ్చారు : ఆదిరెడ్డి భవానీ

-

నిన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు చెల్లని ఓట్లు పడ్డ సంగతి.. అందులో ఒకటి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీదన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే నిన్న సాయంత్రం నుంచి రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి.. ఆదిరెడ్డి భవానీ కావాలనే ఇలా చేశారని కొందరు, లేదు ఆమె టీడీపీని విడబోతుందని ఇంకొందరు ఇలా ఎవరికి వారే ఊహించేసుకొని పుకార్లు సృష్టించారు. అయిటీ తాజాగా దీనిపై ఆదిరెడ్డి భవానీ వివరణ ఇచ్చారు. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ లో ఎలా ఓటు వేయాలో ముందే శిక్షణ ఇచ్చినా, తాను పోలింగ్ సమయంలో పొరబడ్డానని తెలిపారు.

ఒకటి అని వేయాల్సిన చోట టిక్ మార్క్ పెట్టానని వెల్లడించారు. ఈ విషయంలో తనదే పొరపాటు అని స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ లో పాల్గొనడం ఇదే మొదటిసారి అని, అయితే, అక్కడున్న సిబ్బందిని టిక్ పెట్టవచ్చా అని అడిగితే వారు ఓకే చెప్పారని, దాంతో టిక్ పెట్టానని వివరించారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు తెలియజేశానని భవాని వెల్లడించారు. లోపల ఉన్న సిబ్బందిలో ఓ వ్యక్తి తాను అడిగినప్పుడు తెలియదు అని చెప్పివుంటే తమ ఏజెంట్లను అడిగి సందేహ నివృత్తి చేసుకునేదాన్నని, అతడు రాంగ్ గైడెన్స్ ఇవ్వడంతో తాను కూడా తప్పుగా టిక్ చేయాల్సి వచ్చిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version