రాష్ట్ర బంద్‌కు ఆదివాసీ హక్కుల పోరాట సమితి పిలుపు.. నిలిచిపోయిన బస్సులు!

-

ఆదివాసీ హక్కుల పోరాట సమితి శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ఆదివాసీ మహిళపై ఓ వర్గానికి చెందిన ఆటో డ్రైవర్ లైంగికదాడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. అనంతరం తీవ్రంగా దాడి చేసి, రన్నింగ్ ఆటో నుంచి ఆ మహిళను కిందకు తోసేశాడు. ఆ తర్వాత రన్నింగ్ ఆటో నుంచి కింద పడిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. బాధిత మహిళ అసలు విషయం వెల్లడించగా జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే ఆదివాసులు నిందితుడి వర్గానికి చెందిన వారి మధ్య అల్లర్లు చెలరేగాయి.

దీంతో జైనూర్ ప్రాంతంలో పరిస్థితులు అదుపుతప్పడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంటర్నెట్ కట్ చేసి.. 144 సెక్షన్ అమలు చేశారు. ఆ తర్వాత పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, జైనూర్‌ ఆదివాసీ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు స్వచ్చందంగా ఈ బంద్‌లో పాల్గొంటున్నారు. రోడ్లపైకి వచ్చిన బస్సులను తుడుందెబ్బ నాయకులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version