అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 274 కి మృతుల సంఖ్య చేరింది. 229 మంది ప్రయాణికులతో పాటు, 12 మంది విమాన సిబ్బంది మృతి చెందారు. విమానం మెడికల్ కళాశాలపై కూలడంతో, కాలేజీ భవనంలో ఉన్న 33 మంది మృతి చెందినట్టు పేర్కొన్నారు అధికారులు.

కాగా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి కూడా ఉన్నారు. మృతుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్, 7 మంది పోర్చుగీస్, ఒక్కరు కెనడా వాసి ఉన్నారు. మృతుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు టాటా సన్స్ గ్రూప్స్ చైర్మన్.