Air India Plane Crash: గుజరాత్లోని అహ్మదాబాద్లో దారుణం జరిగింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో కుప్పకూలింది ఎయిరిండియా విమానం. మెఘానిలోని గుజ్ సెల్ విమానాశ్రయ సమీపంలోని జనావాసంలో కుప్పకూలింది విమానం. ఈ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది… గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు.

ఎయిర్ ఇండియా AI-171 విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రమాద విమానంలోనే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు సమాచారం అందుతోంది. అహ్మదాబాద్ లోని సివిల్ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. మంటలను 9 ఫైర్ ఇంజిన్లు అదుపు చేస్తున్నాయి. ఇక గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
LIVE VIDEO
Flight AI171, operating Ahmedabad-London Gatwick, was involved in an incident today#Ahmedabadplanecrash #london #planecrash #Ahmedabad #AirIndia pic.twitter.com/XFKVYVPf5k
— Vijaykumar Desai (@KumarVijayDesai) June 12, 2025