ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 110 మందికి పైగా మృతి..?

-

అహ్మదాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై కూలింది ఎయిర్ ఇండియా విమానం. అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే మేఘాని ప్రాంతంలో కుప్పకూలింది విమానం. ఇక ఈ ఎయిర్ ఇండియా ప్రమాదంలో 110 మంది చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.

Initial reports suggest 110 dead in Air India crash
Initial reports suggest 110 dead in Air India crash

ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 110 మంది చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. 242 ప్రయాణికులలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటీష్ జాతీయులు, 7 మంది పోర్చుగీసు, ఒక కెనెడియన్ ఉన్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటన చేసింది.

ఈ ప్రమాద విమానంలోనే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ( Vijay rupani )ఉన్నట్లు సమాచారం అందుతోంది. అహ్మదాబాద్ లోని సివిల్ ఆసుపత్రికి క్షతగాత్రుల ను తరలించారు. మంటలను 9 ఫైర్ ఇంజిన్లు అదుపు చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news