అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం…. పొగాకు ఉత్పత్తుల యాడ్ నుంచి తప్పుకున్నట్లు వెల్లడి

-

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రమోట్ చేస్తున్న పొగాకు ఉత్పత్తుల యాడ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అక్షయ్ కొద్ధి రోజులుగా విమల్ పాన్ మసాలను ప్రమోట్ చేస్తున్న యాడ్ లో కనిపిస్తున్నాడు. ఈ యాడ్ పై అక్షయ్ ఫ్యాన్స్, నెటిజెన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై తాజాగా స్పందించిన అక్షయ్  తనను క్షమించాలని, విమల్ పాన్ మసాలా యాడ్ బ్రాండ్ అంబాసిడర్ గా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 

ఇదిలా ఉంటే గతంలో కూడా పలువురు హీరోలు, హీరోయిన్లు పొగాకు, మద్యం ఉత్పత్తులను ప్రమోట్ చేయడాన్ని నెటిజెన్లు, ప్రేక్షకులు తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. టాలీవుడ్ లో మహేష్ బాబు వంటి స్టార్లపై కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి.  రెజీనా, ప్రగ్యా జైశ్వాల్ వంటి వారు పలు రకాల మద్యం బ్రాండ్ కు సంబంధించిన యాడ్స్ లో నటించారు. అయితే వీటిపై నెటిజెన్లు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఇటీవల రష్మిక ఓ అండర్ వేర్ యాడ్ లో నటించడంతో నెటిజెన్లు తెగ కామెంట్లు పెట్టడం, ట్రోల్ చేయడం చూశాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version