మద్యం మత్తులో యువకుల హల్‌చల్.. కౌన్సిలర్ భర్తపై కత్తితో అటాక్

-

కారు ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించినందుకు కౌన్సిలర్ భర్తపై, అడ్డొచ్చిన మరో ఇద్దరిపై యువకులు కత్తులతో దాడికి పాల్పడ్డారు.ఈ ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో వెలుగుచూసింది. చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి కథనం ప్రకారం..నగరంలోని సరూర్ నగర్‌కు చెందిన మిరాజ్, ఖాజా, షకీర్, షారుక్ అమిన్‌లు చౌటుప్పల్‌లోని తన ఫ్రెండ్ నుమాన్‌ను కలిసేందుకు వచ్చారు. అనంతరం పార్టీ చేసుకుని మద్యం తాగారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ హిమబిందు భర్త అరుణ్ తన ఇంటి వద్ద నుంచి రోడ్డు వైపు వెళ్తుండగా ఈ యువకులు కారులో ర్యాష్‌ డ్రైవింగ్ చేస్తూ వెళ్లారు.

దీంతో వారిని అరుణ్ మందలించగా ఒక్కసారిగా ఐదుగురు కారులోంచి దిగి దండ అరుణ్‌పై దాడి చేశారు. వీరిలో ఓ యువకుడు కత్తితో దండ అరుణ్‌ను పొట్టలో పొడిచాడు. అదే కాలనీకి చెందిన సురేందర్ రెడ్డి, సురకంటి బాలకృష్ణారెడ్డిలు యువకులను ఆపడానికి యత్నించగా వారిపైనా కత్తితో దాడి చేశారు.వెంటనే అప్రమత్తమైన స్థానికులు వారిని పట్టుకొని చితకబాదారు. మీరాజ్,ఫరీద్‌లకు గాయాలవ్వడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news