తిరుమల వెళ్ళే వారికి ముఖ్య గమనిక..

-

లాక్ డౌన్ అనంతరం దర్శనం కోసం తిరుమలకు నేరుగా వెళ్ళే వీలు లేదు. ముందు గానే మనం తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన వెబ్ సైట్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈరోజు నుంచి జనవరి 2వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ తాత్కాలికంగా నిలిపివేస్తోంది. నిజానికి ఇప్పటికే 24వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్లను టీటీడీ జారీ చేసిన సంగతి తెలిసిందే.

అయితే నిజానికి డిసెంబర్ 24 నుంచి జనవరి 3వ తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనం కోసం తిరుపతిలోని స్థానికులకు మాత్రమే టీటీడీ టోకెన్లను జారీ చెయ్యనుంది. దీంతో నేటి నుంచి జనవరి 3వ తేదీ వరకు శ్రీవారి దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులే తిరుమలకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కరోనా నిబంధనలు నేపథ్యంలో దర్శన టిక్కెట్లు లేని భక్తులు తమ ప్రయాణం వాయిదా వేసుకోవాలని  భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version