ఐపిఎల్ లో రాహుల్ పైనే అందరి కళ్ళు…!

-

టీం ఇండియా యువ ఆటగాడు కెఎల్ రాహుల్ పై ఇప్పుడు టీం ఇండియా అభిమానులు దృష్టి పెట్టారు. ఐపిఎల్ కోసం దుబాయ్ వెళ్ళిన ఈ యువ ఓపెనర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అతను ఈ ఏడాది ఐపిఎల్ లో కీపర్ గా బ్యాట్స్మెన్ గా ఏ స్థాయిలో రాణిస్తాడు అనే దానిపైనే ఉత్కంట ఎక్కువగా ఉంది. మాజీ కెప్టెన్ ధోనీ రిటైర్ అయిన తర్వాత జట్టుకి కీపర్ ఎవరు అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.

ఈ నేపధ్యంలోనే కీపర్ గా కెఎల్ రాహుల్ ని తీసుకుంటే మంచిది అనే భావన వ్యక్తమవుతుంది. అతనిని ప్రధాన కీపర్ గా ఎంపిక చేస్తే జట్టుకి బలం అని, రిషబ్ పంత్ ని రెండో కీపర్ గా తీసుకోవాలని సూచిస్తున్నారు. రిషబ్ పంత్ కూడా ఇప్పుడు భారత జట్టులో కీపర్ స్థానం కోసం ఆశిస్తున్నాడు. రాహుల్ పంజాబ్ కి ఆడుతుంటే పంత్ ఢిల్లీ కి ఆడుతున్నాడు. దీనితో వీరు ఎలా రాణిస్తారు అనేది ఆసక్తిగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version