ఆడుకోవడానికి వెళ్తే ముగ్గురి ప్రాణాలు పోయాయి..?

-

చిన్న పాటి నిర్లక్ష్యం ప్రాణాలు తీస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. చెరువుగట్టున ఆడుకోడానికి వెళ్ళిన చిన్నారుల ఆనందాన్ని చూసి విధి వక్రించింది చివరికి మృత్యువు కబళించింది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో చోటుచేసుకుంది. పిట్టల వాడ గ్రామ చెరువులో ఆడుకునేందుకు రవి నవీన్ అఖిల అనే చిన్నారులు మరో ఇద్దరు చిన్నారులతో కలిసి వెళ్లారు.

గట్టున కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ చెరువులోకి రాళ్లు విసిరి ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు రవి నవీన్ అఖిల ఒకరి తర్వాత ఒకరు చెరువులో పడిపోయారు. ఇక చెరువుకి గ్రామానికి ఎక్కువ దూరం ఉండడంతో గట్టున ఉన్న చిన్నారులు గ్రామానికి చేరుకుని జరిగిన విషయం కుటుంబ సభ్యులకు తెలిపి చెరువు వద్దకి చేరుకునేసరికి సమయం దాటిపోయింది. ఇప్పటికే చిన్నారులు మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.

Read more RELATED
Recommended to you

Latest news