వైసీపీ ఈవీఎం ట్యాంపరింగ్ చేశారంటూ ఆరోపించడం సిగ్గుచేటు : ఎమ్మెల్యే సత్యప్రసాద్

-

ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి 165 సీట్లను గెలుచుకుని విజయం సాధించింది. 2019లో 151 సీట్లను గెలుచుకున్న వైసీపీ ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లలో మాత్రమే గెలుపొంది ఘోర పరాజయమ పాలైంది.అయితే, వైసీపీ అధికారంలో ఉన్న నాడు ప్రతిపక్ష నాయకులపై జరిగిన అవమానాలపై పలువురు నాయకులు స్పందిస్తున్నారు.

ఈ క్రమంలోనే ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే సత్యప్రసాద్ మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న నాడు చేసిన తప్పులకు ఇప్పుడు వైసీపీ భయపడుతోందని , ముందు కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టిందే జగన్ అని ఆరోపించారు. ప్రజాగ్రహానకి గురైన వైసీపీ ఈవీఎం ట్యాంపరింగ్ చేశారంటూ ఆరోపించడం సిగ్గుచేటుగా ఉందని ఎద్దేవ చేశారు. ప్రజా తీర్పును వైసీపీ నేతలు తప్పుబట్టడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో వైసీపీ ఎమ్మెల్యేను బీజేపీ గడప కూడా తొక్కనివ్వదని సత్యకుమార్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version