పాతబస్తీ మెట్రోకు రూ.500 కోట్లు కేటాయింపు – సీఎం కేసీఆర్

-

పాతబస్తీ మెట్రోకు రూ.500 కోట్లు కేటాయింపు చేశామని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్. ఇవాళ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం పగబట్టినట్లే వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్‌. మెట్రోకు నిధులు ఇవ్వకుండా పక్కనపెట్టింది.. పాతబస్తీ మెట్రోకు రూ.500 కోట్లు కేటాయించామన్నారు.

మోండా మార్కెట్‌ను సైంటిఫిక్‌గా కట్టారు.. అన్ని జిల్లా కలెక్టర్లకు మోండా మార్కెట్ చూపించామని వెల్లడించారు. ప్రతి డివిజన్‌లో ఆధునిక మార్కెట్ల నిర్మాణం అని వివరించారు కేసీఆర్. కల్తీ విత్తనాలు అమ్మేవారిపై పీడీయాక్ట్ పెడతాం.. రైతులకు నకిలీ విత్తనాల ఇబ్బందులు లేకుండా చూస్తాం.. వెజ్, నాన్‌వెట్ మార్కెట్లలో మరిన్ని సౌకర్యాలు అందిస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version