రంగారెడ్డిలో 2 ఎకరాల పొలం కొన్న అల్లు అర్జున్‌

-

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ రెండు ఎకరాల పొలం కొనుగోలు చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం తహసిల్దార్ కార్యాలయంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ సందడి చేశారు. రంగా రెడ్డి జిల్లాలోని జనవాడ గ్రామం పరిధిలో రెండు ఎకరాల పొలం కొనుగోలు చేశాడు బన్నీ. ఈ భూమి రిజిస్ట్రేషన్ కొరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు శంకర్ పల్లి తహసిల్దార్ కార్యాలయానికి వచ్చారు అల్లు అర్జున్.

దీంతో అల్లు అర్జున్‌ తో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు అభిమానులు. ఇక రిజిస్ట్రేషన్ అనంతరం తహసిల్దార్ సైదులు అల్లు అర్జున్ కు ప్రోసిడింగ్ ఆర్డర్ అంద జేశారు. కాగా.. ప్రస్తుతం అల్లు అర్జున్‌… పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ను టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌.. తెరకెక్కిస్తుండగా… రష్మిక హీరోయిన్‌ గా నటిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నారు. కాగా.. ఈ సినిమా డిసెంబర్‌ 17న విడుదల అవుతోంది.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version