మైనారిటీ ఓట్ల కోసమే.. చిదంబరం పై అమిత్ షా ఫైర్..!

-

కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. మైనార్టీ ఓట్లని పొందడానికి మాత్రమే సిఏఏ రద్దు చేయాలని కాంగ్రెస్ కోరుకుంటున్నారని అన్నారు. మంగళవారం మీడియా తో మాట్లాడుతూ 1960 నుండి ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలని ఆయుధంగా మార్చుకుందని అన్నారు.

దీనికి వ్యతిరేకంగా అనేక ఏళ్ల నుండి పోరాడుతున్నామని అన్నారు 2014 నుండి మోడీ ప్రజల ఎజెండాని రూపొందించారని అభివృద్ధి చేస్తూ ఎన్నికల్లో పోటీ చేయలేకనే బొజ్జగింపు రాజకీయాలకి పాల్పడుతున్నారని అన్నారు. చిదంబరం ఆశయాలు ఎప్పటికీ ఫలించవని అమిత్ షా అన్నారు. సీఎఏ వల్ల ఎవరి పౌరసత్వం రద్దు కాదని కాంగ్రెస్ ఎందుకు అభ్యంతరం తెలుపుతుందో అర్థం కావట్లేదని అమిత్ షా అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version