కలకలం రేపుతున్న అమ్మాజీ స్వామి కిడ్నాప్ వ్యవహారం

-

కర్ణాటకకు చెందిన అమ్మాజీ స్వామి అనే స్వామీజీ కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. కర్ణాటకలోని కోలార్ జిల్లా కపిలాపూర్ గ్రామం నుంచి తనను దుండగులు కిడ్నాప్ చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. భాస్కర్ రెడ్డి, సతీష్ అనే ఇద్దరు విమానంలో శిరిడి వెళ్దామని స్వామీజీని నమ్మించి ఓ కారులో హైదరాబాద్ తీసుకువచ్చారని ఆయన ఆరోపిస్తున్నారు. అదే కారులో హైదరాబాద్ నుంచి శంషాబాద్ మీదుగా బెంగళూరు తీసుకువెళ్లారని అనంతరం ఓ గదిలో బంధించి 20 కోట్ల నగదు కిలో బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆయన ఆరోపిస్తున్నారు.

లేదా పది ఎకరాల వ్యవసాయ భూమి అయినా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు అని చెబుతున్నారు.  అయితే అయిదు కోట్లు ఇస్తాననీ ఒప్పుకోవడంతో స్వామీజీని హైదరాబాద్ తిరిగి తీసుకు వచ్చారట. హైదరాబాద్ చేరుకోగానే గుండెనొప్పి వస్తుందంటూ స్వామి నాటకం ఆడాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించమని కోరగా వారు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన స్వామీజీ ఎట్టకేలకు వారిని పోలీసులకు పట్టించారు.

Read more RELATED
Recommended to you

Latest news