అమరావతి ర్యాలీ… షాక్ ఇచ్చిన పోలీసులు…!

-

అమరావతి ఉద్యమం కొనసాగుతుంది. 299 రోజులకు ఈ ఉద్యమం చేరుకుంది. తమ ప్రాంతాన్ని రాజధానిగా కొనసాగించాలి అని రైతులు మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఇక 300 రోజులకు ఉద్యమం చేరుతున్న నేపధ్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నారు. తాజాగా అమరావతికి మద్దతుగా భారీ ర్యాలీ చేయాలని కొందరు మహిళలు భావించారు.

Amravati

అమరావతి ఉద్యమం 300 వ రోజు… మహిళల ర్యాలీ కి పిలుపు ఇచ్చింది అమరావతి జేఏసీ. విజయవాడ లోని బీ.ఆర్.టీ. ఎస్ రోడ్ లో ఉన్న శారదా కళాశాల దగ్గర నుంచి ర్యాలీ ప్రారంభం చేయనున్నారు. అమరావతి జేఏసీ ర్యాలీ కి అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు. బీ.ఆర్.టీ. ఎస్ రోడ్ లో భారీగా మోహరించిన పోలీసులు… కోవిడ్ కారణంగా ర్యాలీ ని అనుమతించేది లేదని స్పష్టం చేసారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన ర్యాలీ నిర్వహిస్తాం అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version