అడిషనల్ ఎస్పీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. స్పాట్ లోనే మృతి

-

హయత్‌నగర్ – లక్ష్మారెడ్డి పాలెం కాలనీ జాతీయ రహదారిపై విషాదం చోటు చేసుకుంది. మార్నింగ్ వాకింగ్ చేస్తున్న అడిషనల్ ఎస్పీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దింతో స్పాట్ లోనే అడిషనల్ ఎస్పీ మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హయత్‌నగర్ – లక్ష్మారెడ్డి పాలెం కాలనీ జాతీయ రహదారిపై ఉదయం 4.30 గంటలకి వాకింగ్ చేస్తూ రోడ్డు దాటుతున్న అడిషనల్ ఎస్పీ TM నందీశ్వర బాబ్జీని ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు.

An RTC bus hit Additional SP TM Nandeeshwara Babji while he was walking across the road on the Hayathnagar-Lakshma Reddy Palem Colony National Highway at 4.30 am

మొదటగా ఒక బస్సు ఢీ కొట్టడంతో నందీశ్వర బాబ్జీ కిందపడ్డాడు. వెనకాలే వచ్చిన నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కడంతో బాబ్జీ అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్నాడు TM నందీశ్వర బాబ్జీ. ఇక TM నందీశ్వర బాబ్జీ మృతి నేపథ్యంలో కుటుంబ సభ్యులు విషాదంలోకి వెళ్ళింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version