శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు చేయిస్తున్న అనసూయ.. అందుకేనా..?

-

సాధారణంగా శ్రీకాళహస్తిలో సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే చాలా వరకు అక్కడ దోష నివారణ చర్యలు మాత్రమే ఎక్కువగా జరుగుతాయి. గతంలో సమంత, సిద్దార్థ్ కూడా కలిసి శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రముఖ స్టార్ యాంకర్ అనసూయ శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఫోటోలు కొన్ని బాగా వైరలవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి కొంతమంది కొన్ని రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

యాంకర్ అనసూయ బుల్లితెర షోలకు దూరం అయ్యి అభిమానులను ఒకింత హార్ట్ చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఫుల్ లెన్త్ రోల్స్ చేస్తూ సినిమాలలో బిజీగా ఉన్న ఈమె ఇప్పుడు మరింత బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే అనసూయ తాను చేసి పోస్టుల గురించి కూడా ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు చేశారు అనసూయ. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ట్రెడిషనల్ లుక్ లో కనిపించగా ఈ లుక్ లో అనసూయ ఎంతగానో బాగుంది అంటూ కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా కొత్త సంవత్సరం తనకు మంచి ఇవ్వాలి అన్న ఆలోచనతో ఆమె ఇలా పూజలు చేయిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈమె తనపై ఏదైనా దోషం ఉందేమో అన్న కారణం వల్లే దోషాల నివారణ కోసమే అనసూయ పూజలు చేశారని తెలుస్తోంది. ఏది ఏమైనా కొత్త సంవత్సరం వివాదాలకు పోకుండా తన పని తాను చేసుకుంటూ మరింత మంచి పొజిషన్ కి చేరుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version