Andhra Pradesh: టీడీపీ అబద్దాలకోరు పార్టీ.. మంత్రి తీవ్ర వ్యాఖ్యలు

-

మంత్రి ఆర్కె రోజా టీడీపీ అబద్ధాలకోరు పార్టీ అని మండిపడ్డారు. ఇవాళ వడమాలపేట మండల పరిషత్ కార్యాలయంలో నూతన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొన్నారు. గుంపులు గుంపులుగా వచ్చే పార్టీని హైదరాబాద్ కు తరిమి కొట్టండని మంత్రి ఆర్కె రోజా అన్నారు.వాళ్లు అందరూ కూడా లోకల్ పొలిటిషియన్స్ కాదని  ఆమె తెలిపారు. చంద్రబాబుకి, పవన్ కల్యాణ్ కి, లోకేష్ కి ఏపీ లో సొంత ఇల్లు గానీ, ఓటు గాని లేదని మంత్రి రోజా తెలిపారు. ఇప్పుడు స్థానికంగా ఓట్లు పెట్టుకుంటున్నారని ఆరోపించారు.

 

చంద్రబాబు కుటుంబం గానీ, పవన్ కళ్యాణ్ కుటుంబం గానీ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నారా అని మంత్రి రోజా ప్రశ్నించారు. చుట్టపు చూపుగా హైదరాబాద్ నుంచి వచ్చి సీఎం జగన్ మీద విషం చిమ్మి.. మమ్మల్ని అందరినీ బూతులు తిట్టడం తప్ప వాళ్ళకి ఏమీ తెలుసు అని అన్నారు . ప్రజల సమస్యలను పరిష్కారం చేయడం రాదని మంత్రి రోజా అన్నారు. జగన్ మాత్రమే ప్రజల మనిషి.. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న ఏకైక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని మంత్రి రోజా అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version