Andhra pradesh : అందుకే పవన్ కలిశాను: అంబటి రాయుడు మరో ట్వీట్

-

Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను కలిసిన తర్వాత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆసక్తికర ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్‌ను ఎందుకు కలిశానన్న విషయంపై క్లారిటీ ఇచ్చాడు.వైసీపీని వీడుతున్నానని, రాజకీయాలకు కొంత కాలం దూరంగా ఉంటానని అంబటి రాయుడు ఇటీవలే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

 

అయితే, ఓ నిర్ణయం తీసుకునే ముందు పవన్ కల్యాణ్ ను కలవాలని తన శ్రేయోభిలాషులు చెప్పారని ,అందుకే తానే పవన్ కల్యాణ్ ను కలిశానని తెలిపారు. తన భావజాలం, పవన్ భావజాలం ఒకేలా ఉన్నాయని ఏపీ ప్రజలకు మనస్ఫూర్తిగా సేవలు అందించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని అంబటి రాయుడు చెప్పారు. తన భావజాలం, వైసీపీ భావజాలానికి భిన్నంగా ఉన్నందువలన ,వైసీపీతో ప్రయాణంలో తన కలలు నెరవేరవని అందుకే వైసీపీకి దూరమయ్యానని అంబటి రాయుడు అన్నారు. ఏదో సీటు కోసం పవన్ కళ్యాణ్ ను కలవలేదని చెప్పారు.ప్రస్తుతం క్రికెట్ టోర్నీలో ఆడేందుకు దుబాయ్ వెళుతున్నానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version