Andhra Pradesh :రేపటి నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ షర్మిల పర్యటన..

-

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్ర పర్యటనకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర పర్యటనకు మొదటగా రేపు శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి షర్మిల పర్యటన మొదలు కానుంది. పార్వతీపురం, విజయనగరం, మన్యం జిల్లాలలో షర్మిల పర్యటన కొనసాగుతుంది. మరుసటి రోజు విశాఖ, అనకాపల్లి మరియు అల్లూరి జిల్లాలలోనే పార్టీ అధినేతలతో సమావేశం కానున్నారు. ఈనెల25న రాయలసీమ,కాకినాడ జిల్లాలతో పాటు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల26న తూర్పు గోదావరి, ఎన్టీఆర్ మరియు ఏలూరు జిల్లాలో షర్మిల పర్యటించనున్నారు. 27న గుంటూరు,కృష్ణా, పల్నాడు జిల్లాల లో పర్యటించనున్నారు. 28న బాపట్ల, ప్రకాశం , నెల్లూరు జిల్లాలకు వెళ్ళనున్నారు. 29న చిత్తూరు,తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో పర్యటించి అక్కడే పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు.

 

అలాగే 30వ తేదీన శ్రీసత్యసాయి, కర్నూలు మరియు అనంతపురం జిల్లాలో పర్యటన కొనసాగనుంది. 31న నంద్యాల, వైయస్సార్ కడప జిల్లా ఇడుపులపాయ తో పర్యటన ముగియనుంది. బాధ్యతలు స్వీకరించి న షర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా భావిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news