వైసీపీ ఫ్రస్టేషన్ కు దాడులే నిదర్శనం : చంద్రబాబు

-

ఓటర్ పై తెనాలి ఎమ్మెల్యే దాడి చేయడం వైసీపీ ఫ్రస్టేషన్ కు నిదర్శనమని టీడీపీ చీఫ్ చంద్రబాబు అభివర్ణించారు. ఓటమి ఖాయమవ్వడంతో వైసీపీ ఎమ్మెల్యేలు విచక్షణ కోల్పోయి ప్రజలపై దాడులు చేస్తున్నారు. ఈ దాడులతో ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని తిరుగుబాటును అణచివేయలేరు. ఐదేళ్లలో ప్రభుత్వ దాష్టీకాలపై నేడు ఓటు రూపంలో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఎన్నికల వేళ వైసీపీ హింసతో పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు చంద్రబాబు. తాడిపత్రిలో ఎస్పీ వాహనం పైనే దాడి చేశారు. టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డిపై దాడికి దిగారు. జగన్ 5 ఏళ్లుగా పెంచి పోషించిన రౌడీ మూకలు.. ఈరోజు తమ దాడుల ద్వారా ప్రజల్లో భయం పుట్టిస్తున్నారు. పోలింగ్ శాతాన్ని తగ్గించి లబ్ది భయం పుట్టిస్తున్నారు. పోలింగ్ శాతాన్ని తగ్గించి లబ్ది పొందే కుట్ర చేస్తున్నారని ట్వీట్ చేశారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version