మందుబాబులకు బంఫర్ ఆఫర్.. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం : చంద్రబాబు

-

మందు బాబులకు బంఫర్ ఆఫర్ ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కుప్పంలో మహిళలతో ముఖాముఖీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా  టీడీపీ అధికారంలోకి వస్తే.. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామన్నారు. మద్యం పై ధరలను  జలగన్న ప్రభుత్వం విపరీతంగా  పెంచేసిందని పేర్కొన్నారు చంద్రబాబు.  లోకల్ బ్రాండ్స్ తో వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను తీస్తోంది.

నేను ఎక్కడో పుట్టలేదు. ఇక్కడే ఒక సాధారణ కుటుంబంలో పుట్టాను. మా అమ్మకు చదువు రాదు. మా నాన్న ఒక రైతు. ఎన్టీఆర్ కూడా ఒక సాధారణ కుటుంబం నుంచే వచ్చారు. మహాత్మాగాంధీ కూడా అంతే. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నోసార్లు చెప్పారు. ఒక రైల్వే స్టేషన్ లో టీ అమ్ముకుంటూ పైకొచ్చిన వ్యక్తి ఆయన. మీ అందరిలోనూ శక్తి ఉంటుంది. దాన్ని వెలికితీయాలన్నదే నా ఆలోచన. మహిళలను అసాధారణ శక్తిమంతులుగా చేసే బాధ్యతను టీడీపీ తీసుకుంటుంది. కుప్పంలో ఇంటికి రెండు ఆవులు ఇస్తానంటే అందరూ ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు 4 లక్షల లీటర్ల పాలసేకరణ సాధ్యమైంది. స్కూలుకు వెళ్లే ఆడపిల్లలందరికీ సైకిళ్లు ఇచ్చాం. ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version