151 వైసీపీ ఎమ్మెల్యేల్లో 140 మంది అవినీతిపరులే – యనమల

-

రాష్ట్రంలో నేరాలు-ఘోరాలు, విధ్వంసాలతో వైసిపి ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారని మండిపడ్డారు టిడిపి సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలలో 140 మంది అవినీతిపరులేనని ఏడిఆర్ నివేదిక చెబుతుందన్నారు. అలాగే దేశంలోని ధనిక ఎమ్మెల్యేలు కూడా వైసీపీ వారేనని అన్నారు యనమల.

సామాజిక న్యాయానికి దోహదపడే బీసీ జనగణను దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలే చేపడుతుంటే.. ఏపీలో జగన్ ప్రభుత్వం బీసీ జనగణన చేయకుండా బీసీలకు తీరని ద్రోహం చేస్తుందని ఆరోపించారు. బీసీల విషయంలో లెక్కలేని తనం చూపుతున్న జగన్ కి త్వరలో బీసీలే బుద్ధి చెబుతారని అన్నారు. ఇక రాష్ట్రంలో పులివెందుల కూడా తెలుగుదేశం పార్టీదే అనే విషయం నిన్న చంద్రబాబు బహిరంగ సభ ద్వారా స్పష్టం అయిందన్నారు. జగన్ సొంత నియోజకవర్గం లో కూడా ప్రజలు చంద్రబాబుకి బ్రహ్మరథం పట్టడం జగన్ పై ఉన్న వ్యతిరేకతకు అద్దంపడుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version