కాలేజీ ల్యాబ్ టెక్నీషియన్ (40) తో ప్రేమలో పడి, ఇల్లు వదిలి వెళ్లిపోయాడు విద్యార్థి (19). చిత్తూరులో ఓ ప్రైవేటు కాలేజీ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న మహిళ తో ప్రేమలో పడ్డాడు బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి (19). భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటూ కాలేజీలో పనిచేస్తున్న మహిళతో పరిచయం పెంచుకున్నాడు విద్యార్థి.

మే 24న బెంగళూరులో ఇంటర్న్షిప్ కోసం వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి, ఆమెతో వెళ్లిపోయాడు విద్యార్థి. ఎన్నాళ్లయినా యువకుడు రాకపోవడంతో అనుమానం వచ్చి ఆరా తీసి, అసలు విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. బెంగళూరులో ఉన్న ఇద్దరిని చిత్తూరుకు తీసుకొచ్చి, కౌన్సిలింగ్ ఇచ్చి వారి ఇళ్లకు పంపించారు పోలీసులు.