ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. ఈ ఏడాది ఈఏపీసెట్‌లో 25 శాతం వెయిటేజీ..

-

ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సులలో ప్రవేశాలకు ఈఏపీసెట్ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఇంటర్ మార్కులకు ఈఏపీసెట్ లో మొత్తం 25% వెయిటేజీ ఇచ్చేవారు. కానీ కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు నిర్వహించని నేపథ్యంలో ఈఏపీసెట్ పరీక్షకు ఇంటర్ వెయిటేజ్ తీసేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అయితే గత ఏడాది ఇంటర్ పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో ఈ సారి యదాతదంగా 25% ఇవ్వనున్నట్లు తాజాగా అధికారులు ప్రకటించారు. ఇది విద్యార్థులకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. ఈ ఏడాది ఈ ఏపీ సెట్ పరీక్షకు హాజరయ్యే వారు గత ఏడాది ఫస్ట్ ఇయర్ పరీక్షకు హాజరయ్యారు. అదేవిధంగా ఈ ఏడాది సెకండ్ ఇయర్ పరీక్షలకు కూడా హాజరుకానున్నారు. ఈ తరుణంలో అధికారులు వెయిటేజ్ ను ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version