రాబోయే రెండేళ్లలో రాష్ట్రానికి మరో 56 కంపెనీలు – సీఎం జగన్

-

రాష్ట్రంలో రాబోయే రెండేళ్లలో 56 పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నాయని తెలిపారు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నం జిల్లాలోని అచ్యుతాపురం సేజ్ లో ఏటీసీ అలయన్స్ టైర్స్ కంపెనీని ప్రారంభించిన సీఎం జగన్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పై ప్రసంగించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మూడేళ్లుగా అవార్డులు అందుకుంటున్నామని సీఎం జగన్ అన్నారు.

వచ్చే రెండేళ్లలో రూ 1.54 లక్షల కోట్ల పెట్టుబడిలతో వచ్చే రెండేళ్లలో 56 కంపెనీలో రాష్ట్రానికి రాబోతున్నాయని చెప్పారు. వీటి వల్ల యువతకు లక్షకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయని అన్నారు. విశాఖలో వచ్చే రెండు నెలల్లో ఆదాని డేటా సంస్థకు శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ అభివృద్ధి పనులన్నీ జరుగుతున్నాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version