ఉద్యోగం ఇప్పిస్తానంటూ మహిళను మోసం చేసిన బీజేపీ నేత

-

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్మార్ట్ యోజనా వెల్ఫేర్ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానని నాతవరం మండలం డి ఎర్రవరం గ్రామానికి చెందిన జగదీశ్వరి అనే మహిళను మోసగించాడు నాతవరం మండల బి.జె.పి నాయకుడు లాలం వెంకట రమణ. జగదీశ్వరి కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 2,85,000 రూపాయల వసూలు చేశాడు.

రెండు సంవత్సరముల గడిచిననా ఉద్యోగాన్ని ఇప్పించకపోవడంతో తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని రమణ ఇంటికి వెళ్లి డిమాండ్ చేసింది బాధితురాలు జగదీశ్వరి. నాతవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. అయితే ఆమె ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తుంది జగదీశ్వరి. తనపై దౌర్జన్యం చేసి తనను కొట్టి గాయపరిచాడు అంటూ నర్సీపట్నం ఏఎస్పీకి ఫిర్యాదు చేసింది బాధిత మహిళ.

Read more RELATED
Recommended to you

Exit mobile version