రెండో భర్తకు పిల్లలు పుట్టాలని.. కూతుళ్లనే బలి పెట్టింది!

-

రెండో భర్తకు పిల్లలు పుట్టాలని.. కూతుళ్లనే బలి పెట్టింది ఓ తల్లి. ఈ దారుణమైన సంఘటన ఏలూరు జిల్లా.. పెదపాడు మండలంలోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన ఓ మహిళను పుట్టా సతీష్..రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే.. రెండో వివాహం చేసుకున్న ఆ భర్త పుట్టా సతీష్…తనకు పిల్లలు కావాలనడంతో కన్న కూతుళ్ళనే…రెండో భర్త దగ్గరకు పంపింది తల్లి. ఈ తరుణంలోనే.. 17 ఏళ్ల వయసులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఆమె మొదటి కూతురు.

ఇక తన రెండో భర్త… మగపిల్లాడు కావాలనడంతో చిన్న కూతురుని బలవంతంగా అతని వద్దకు పంపింది తల్లి. ఈ తరుణంలోనే.. ఏడాది క్రితం మృత శిశువుకు జన్మనిచ్చింది ఆ మైనర్ బాలిక. అయితే.. తాజాగా ఆ భార్య, భర్తల మధ్య విభేదాలతో ఈ దారుణం వెలుగు చూసింది. ఇక మేనమామ సాయంతో ఏలూరు దిశా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ ఇద్దరు బాధిత బాలికలు. దీంతో పోక్సో కేసు నమోదు చేసి పుట్టా సతీష్, అతని భార్యను అదుపులో తీసుకున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news