ములుగు జిల్లాలో విషాదం.. మావోయిస్టుల మందుపాతర పేలి ఓ వ్యక్తి మృతి !

-

ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ములుగు జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. వాజేడు మండలం కొంగాలగుట్టపై ఈ ఘటన జరిగింది. ఇవాళ ఉదయం కట్టెల కోసం అడవికి వెళ్లారు ముగ్గురు వ్యక్తులు. అయితే…. పోలీసులను హతమార్చడం కోసం మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేల్చి ఒకరు మృతి చెందారు.

A man was killed in a landmine planted by Maoists in Mulugu district

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుడు జగన్నాధపురం గ్రామానికి ఏసు గా గుర్తించారు పోలీసులు. గాయపడ్డవారు ఇదే గ్రామానికి చెందిన రమేష్, ఫకీర్ గాగుర్తించారు పోలీసులు. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడం తో ఒక్కసారిగా ఏజెన్సీ ప్రాంతం ఉలిక్కిపడింది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news