ఏపీలో కొంపముంచిన సెల్ఫీ… తెలుగు గంగలో పడి యువకుడు మృతి

-

నంద్యాలలో ప్రాణం తీసింది సెల్ఫీ పిచ్చి. మహానంది క్షేత్రం సమీపంలోని తెలుగు గంగ కాల్వ వద్ద సెల్ఫీ దిగడానికి వెళ్ళిన మృతి చెందాడు యువకుడు సుర సుర గౌతమ్. ప్రమాదవశాత్తు తెలుగు గంగలో పడి , గల్లంతు అయ్యాడు గౌతమ్. గాజులపల్లె ఆర్.ఎస్. సమీపంలో గౌతమ్ మృతదేహన్ని చూశారట స్థానికులు. అయితే… స్థానికులు పంపిన వీడియోల ఆధారంగా మృతదేహాన్ని గాలిస్తున్నారు మహానంది పోలీసులు.

a young man died after falling into the Telugu Ganges

గౌతం స్వస్థలం వైయస్సార్ కడప జిల్లా బద్వేలు టౌన్ ఐలమ్మ కాలనీ గా గుర్తించారు పోలీసులు. వ్యవసాయ కూలిగా పనిచేస్తే జీవనం సాగిస్తున్నాడు గౌతమ్. మహానంది క్షేత్రానికి వచ్చి తిరిగి వెళుతూ సెల్ఫీ దిగే ప్రయత్నం చేశాడు గౌతమ్. గౌతమ్ తల్లి మహాలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు మహానంది పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version