ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బీటెక్ విద్యార్థినిపై యువకుడి అత్యాచారం జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో దారుణం జరిగింది. బీటెక్ విద్యార్థినిపై యువకుడి అత్యాచారం చేశారు. వీడియో తీసి విద్యార్థిని యువకుడు వేధింపులకు గురిచేశాడు. అయితే.. ఆ వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రులకు చెప్పింది బాధిత యువతి.
దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు బీటెక్ విద్యార్థిని తల్లి దండ్రులు. ఇక ఈ సంఘటన పై రంగంలోకి దిగిన పోలీసులు.. దీనిపై కేసు నమోదు చేసుకుని.. బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం చేసిన యవకుడిని అరెస్ట్ చేశారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.