BREAKING : నెల్లూరు జిల్లా ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి

-

 

దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నియమ నిబంధనాలు తీసుకొచ్చినా.. రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే.. తాజాగా ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బద్వేలు జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

ఇక ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కొడవలూరు మండలం దామేగుంట గ్రామానికి చెందిన రెండు కుటుంబాలకు చెందిన వారు చెన్నైకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతోంది. ఆగివున్న కంటైనర్ ను వేగంగా ఇన్నోవా వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇక ఈ ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలనికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స కోసం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news