తెలంగాణ రాష్ట్ర రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ సారి వరి నాట్లు పడక ముందే రైతు భరోసా నిధులు అందరికీ ఒకేసారి వేస్తామని వెల్లడించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఖరీఫ్ నాట్లు పడకముందే అన్ని ఎకరాలకు ఒకేసారి రైతుల ఖాతాల్లో రైతు భరోసా పెట్టుబడి సాయం జమ చేస్తామని ప్రకటించారు.
ఇది ఇలా ఉండగా, ఇటివలే తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలు అసలు ఎందుకని ఆయన మండిపడ్డారు. రేషన్ బియ్యం అమ్ముకునే వాళ్లకు… సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వాలని ఆయన ఫైర్ అయ్యారు.