ఏపీలో గోవా కంటే తక్కువ ధరలో మద్యం.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం

-

అమరావతిలోని సచివాలయం వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ  సమావేశంలో నూతన మద్యం పాలసీ, వాలంటీర్ వ్యవస్థపై సుదీర్ఘ చర్చ జరిగింది. అలాగే మరికొన్ని అంశాలపై కూడా మంత్రులతో సీఎం చర్చించారు. చివరకు ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇందులో కొత్తం మద్యం పాలసీకి ఆమోదం తెలిపింది. అలాగే నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని, సగటున మద్యం ధర రూ. 99 గా (క్వాటర్) ఉండాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీలో గోవా కంటే కూడా తక్కువ ధరలో మద్యం అందుబాటులోకి రానుంది.

ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ ఏపీ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.  ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.99కే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే భోగాపురం విమానాశ్రయానికి అల్లురి సీతారామరాజు పేరు పెట్టాలని నిర్ణయించారు. కౌలు రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకోగా.. వాలంటీర్ వ్యవస్తపై సూదీర్ఘంగా చర్చ, బీసీలకు 33 శాతం రిజర్వేషన్ పై  కూడా చర్చించింది కేబినెట్.. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version