తిరుమల భక్తులకు అలర్ట్.. ప్రైవేటు వాహనాలకు నో ఎంట్రీ !

-

తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. ఇవాళ తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు కొనసాగనున్నాయి. ఇవాళ తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించబోతున్నట్లు ఈ మేరకు టీటీడీ పాలకమండలి అధికారిక ప్రకటన చేసింది. తిరుమలకుట్ట పైన ఉన్న ఆకాశగంగా , బాలాంజనేయ, జపాలి తీర్థాల్లో జరగబోతున్నట్లు అధికారికంగా వెల్లడించింది టీటీడీ పాలక మండలి.

Alert for Tirumala devotees No entry for private vehicles
Alert for Tirumala devotees No entry for private vehicles

భక్తుల రధికారణంగా పాప వినాశనం అలాగే ఆకాశగంగా తీర్థాలకు వెళ్లే మార్గాల్లో ప్రైవేటు వాహనాలకు అస్సలు అనుమతి నిరాకరిస్తున్నట్లు వెల్లడించింది. ఆ ప్రాంతాలకు వెళ్లే భక్తులు కచ్చితంగా ఆర్టీసీ బస్సులు మాత్రమే వెళ్లాలని సూచనలు చేస్తున్నారు అధికారులు.

కాగా ఈ రోజు ఇవాళ తిరుమలలో ఆగస్టుకు సంబంధించిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీ‌వారి సాల‌క‌ట్ల ప‌విత్రోత్సవాల‌ టికెట్లను విడుదల చేయనుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను రిలీజ్ చేస్తుంది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలంది. అటు ఇవాళ తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు కొనసాగనున్నాయి. ఇవాళ తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించబోతున్నట్లు ఈ మేరకు టీటీడీ పాలకమండలి అధికారిక ప్రకటన చేసింది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news