ఘోర రోడ్డు ప్రమాదం..అక్క‌డిక‌క్క‌డే ముగ్గురి మృతి

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణ సమీపంలో గరుడ స్టీల్ ప్లాంట్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎద్దును తప్పించబోయిన‌ తుఫాన్ వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

విష‌యం తెలిసిన వెంటనే పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారు తాడిపత్రి మెయిన్ బజార్‌కు చెందిన వారుగా గుర్తించారు. వీరంతా తిరుపతి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news