సోనియా గాంధీ డిక్లరేషన్ పై సంతకం చేశారు..జగన్‌ కూడా చేయాల్సిందే – ఏపీ మంత్రి

-

సోనియా గాంధీ డిక్లరేషన్ పై సంతకం చేశారు..జగన్‌ కూడా చేయాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్ర ప్రదేశ్‌ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ పై ఆంధ్ర ప్రదేశ్‌ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్వామి మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా అన్యమతస్తులు దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలని కోరారు.

Andhra Pradesh Minister Dola Sri Bala Veeranjaneya Swamy

గతంలో రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ఆజాద్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా డిక్లరేషన్ పై సైన్ చేసి స్వామి వారిని దర్శించుకున్నారని గుర్తు చేశారు ఆంధ్ర ప్రదేశ్‌ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా మేము ఈ డిమాండ్ ని ఆయన ముందు ఉంచడం జరిగిందన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ నియమాన్ని ఉల్లంఘించడం జరిగిందని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం నియమాలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వవలసిందేనని తెలి పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version