జగన్ పల్నాడు జిల్లాలో పర్యటనలో మరో వ్యక్తి మృతి చెందారు. మాజీ సీఎం జగన్ రెంటపాలెం పర్యటనలో మరో అపశృతి చోటు చేసుకుంది. సత్తెనపల్లి క్లాక్ టవర్ దగ్గర వైసీపీ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయాడు.

ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. కాగా, ఉదయం కూడా జగన్ కాన్వాయ్ ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందిన విషయం తెలిసిందే.
ఇక అటు సింగయ్య మృతి ఘటనపై స్పందించాడు పల్నాడు ఎస్పీ. సింగయ్యను ప్రమాదానికి వైఎస్ జగన్ కాన్వాయ్ కారణం కాదని పేర్కొన్నారు. సింగయ్య ను YS Jagan కాన్వాయ్ వెహికల్ కాకుండా ప్రైవేట్ వెహికల్ (AP26CE0001) అనే టాటా సఫారీ అతను గుద్ది ఆపకుండా వెళ్ళిపోయారని తెలిపారు.