ఇవాళ ఏపీ కేబినెట్‌ సమావేశం… వాళ్లకు శుభవార్త

-

ఇవాళ ఏపీ కేబినెట్‌ సమావేశం జరుగనుంది. ఎస్‌ఐపీబీ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రాజధాని నిర్మాణానికి మరింత భూ సేకరణపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అదనపు భూమి కూడా పూలింగ్‌ ద్వారానే తీసుకునే అవకాశం ఉంది.

అలాగే ఉచిత బస్సు పై కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వార్డు సచివాలయ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందింది. వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీపై సొంత మండలానికి వెళ్ళకూడదని నిబంధన నుంచి తాజాగా ఏపీ కూటమి ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

ఉద్యోగులు సొంత వార్డులో కాకుండా ఆ పట్టణంలోని ఇతర వార్డులు లేదా ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలు అదే సమయంలో కార్పోరేషన్లకు బదిలీపై వెళ్లేందుకు అర్హులని తాజాగా ప్రకటన చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇక అటు తమకు ఇదే తరహా అవకాశం ఇవ్వాలని.. ఒకే శాఖకు చెందిన ఉద్యోగులకు రెండు రకాల నిబంధనలు సరికాదని గ్రామ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని.. కోరుతున్నారు. అయితే దీనిపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news