నేడు ఏపీ క్యాబినెట్ భేటీ జరుగనుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చ ఈ సందర్బంగా జరుగనుంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు అమోదం తెలపనుంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం. తల్లికి వందనం నిధుల విడుదలకు అమోదం తెలపనుంది.

కూటమి సర్కార్ ఏడాది పాలనపై ప్రత్యేక చర్చ జరుగనుంది. ఈ నెల 21న వైజాగ్ లో జరిగే అంతర్జాతీయ యోగా డే పై చర్చించనున్న మంత్రివర్గం… ముఖ్యంగా తల్లికి వందనం నిధుల విడుదలకు అమోదం తెలపనుంది.
కాగా నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు జరుగనున్నాయి. ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని.. ‘వెన్నుపోటు దినం’ పేరిట వైసీపీ నిరసన కార్యక్రమాలు జరుగనున్నాయి. నేడు వెన్నుపోటు దినానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.