నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు జరుగనున్నాయి. ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని.. ‘వెన్నుపోటు దినం’ పేరిట వైసీపీ నిరసన కార్యక్రమాలు జరుగనున్నాయి. నేడు వెన్నుపోటు దినానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో మేము అమలు చేసిన పథకాలను ఆపేశారు. వారు ఇస్తామన్నా సూపర్-6 పథకాలను ఇవ్వలేదు. ఇప్పటివరకు 143 హామీలను పట్టించుకోలేదు. ఈ పాలనకు వ్యతిరేకంగా ఇవాళ జరిగే వెన్నుపోటు దినములో ప్రతి ఒక్కరు వారి నియోజకవర్గాల్లో పాల్గొనాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.