‘ఆడుదాం ఆంధ్రా’ విజేతలకు రూ.12 కోట్ల బహుమతులు: మంత్రి రోజా

-

‘ఆడుదాం ఆంధ్రా’ విజేతలకు రూ.12 కోట్ల బహుమతులు అని ఏపీ మంత్రి రోజా ప్రకటించారు. క్రీడాభివృద్ధి, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.

AP Minister Roja announced that the winners of ‘Audham Andhra’ will receive Rs 12 crore prizes

‘ఆడుదాం ఆంధ్ర’ రాష్ట్ర వ్యాప్త క్రీడా టోర్నమెంట్ల వీడియో లాంచ్, బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో శాఫ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో కలిసి క్రీడా శాఖ మంత్రి రోజా పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఆ రోజా మాట్లాడుతూ…. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఆడుదాం ఆంధ్ర వంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదన్నారు. ప్రస్తుతం యువతలో ఫిజికల్ ఫిట్నెస్ సరిగా ఉండడం లేదన్నారు. ఆడుదాం ఆంధ్ర యువతకు మంచి అవకాశం అని చెప్పారు. టోర్నమెంట్ లో 12 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందిస్తామని మంత్రి రోజా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news