ఆ రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?

-

డిసెంబర్ 3వ తేదీన ఐదు రాష్ట్రాల (తెలంగాణ, ఛత్తీస్​గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం) అసెంబ్లీ స్థానాల కౌంటింగ్ జరగనుందని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​ను సీఈసీ ఒకరోజు వాయిదా వేసింది. డిసెంబర్​ 3వ తేదీకి బదులు డిసెంబర్​ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరపనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు..

మిజోరం ప్రజలకు ఆదివారం ప్రత్యేకమైన రోజు అయినందున కౌంటింగ్​ తేదీ మార్చాలని వివిధ వర్గాల నుంచి అభ్యర్థనలు వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. వారి అభ్యర్థనలు పరిగణనలోకి తీసుకుని డిసెంబర్​ 4వ తేదీకి కౌంటింగ్​ను వాయిదా వేసినట్లు వెల్లడించింది. మిగతా నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ యథావిథిగా జరుగుతుందని స్పష్టం చేసింది.

మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న మిజోరం రాష్ట్రంలో ఒకే విడతలో నవంబర్​ 7వ తేదీన ఎన్నికలు జరిగాయి. 11 జిల్లాల వ్యాప్తంగా 40 స్థానాల్లో ఆరోజు సాయంత్రం 5గంటల వరకు 77.04శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక ఈ రాష్ట్రంలో మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (MNF), కాంగ్రెస్‌, జోరం పీపుల్స్‌ మూమెంట్ (ZPM) మధ్యే ప్రధాన పోటీ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news