పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్‌?

-

పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు రౌడీ షీట్‌ తెరిచినట్లు సమాచారం. ఏపీలో పోలింగ్‌ జరిగిన రోజున రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామంలోని కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎం పగలగొట్టిన విషయం తెలిసిందే. దీన్ని అడ్డుకున్న టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరి రావుపై అనుచరులతో దాడి చేయించారు.

పోలింగ్‌ మరుసటి రోజు కారంపూడిలో ఇద్దరు సోదరులూ అనుచరులతో కలిసి దాడులు చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలకు సంబంధించి పిన్నెల్లి సోదరులపై కేసులు నమోదైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో వీరి మీద రౌడీ షీట్‌ తెరిచినట్లు తెలిసింది. అయితే రౌడీ షీట్ తెరవడంపై వివరాలు చెప్పేందుకు పోలీసు అధికారులు సుముఖత వ్యక్తం చేయడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version