నేడే ఏపీ టెట్‌ ఫలితాలు

-

ఏపీ టెట్‌ విద్యార్థులు, అభ్యర్థులకు అలర్ట్. ఇవాళ టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రకటన జారీ చేశారు. ఫలితాలు ఎన్ని గంటలకు విడుదల చేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు టెట్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. 2.35లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు.

అయితే ఫలితాలు మార్చి 14వ తేదీనే విడుదల కావాల్సి ఉండగా.. ఎన్నికల కోడ్‌ కారణంగా వెల్లడించలేదు. టెట్‌లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హులు కావడం, డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉండటంతో ఈ ఫలితాలు ఎంతో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

మరోవైపు మెగా డీఎస్సీతోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించని వారు, ఈ టెట్‌ ప్రకటన తర్వాత బీఈడీ, డీఈడీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డీఎస్సీతోపాటు టెట్‌ నిర్వహించాలని నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version