నేటి నుంచి చంద్రబాబు కుప్పం టూర్….షెడ్యూల్‌ ఇదే

-

నేటి నుంచి రెండు రోజుల పాటు సిఎం చంద్రబాబు కుప్పం టూర్ ఉండనుంది. ఇవాళ మ.12.30 గం. లకు పి ఈ ఎస్ మెడికల్ కాలేజీ హెలిప్యాడ్, కుప్పంకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. మ.12.55 గం. శాంతిపురం జల్లిగానిపల్లి గ్రామం నందు లకు హెచ్ ఎన్ ఎస్ ఎస్ కాలువ పరిశీలన చేస్తారు.

Chandrababu’s Kuppam tour from today

మ.1.35 గం. లకు శాంతిపురం మండలం చిన్నారి దొడ్డి గ్రామంలో హెచ్ ఎన్ ఎస్ ఎస్ కాలువ పరిశీలన…. మ.02.10 గం. లకు కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహంలో విరామం తీసుకుంటారు. ఇక మ.3.00 గం. లకు ఎన్ టి ఆర్ విగ్రహం కూడలి, కుప్పం-బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. సా.4.35 గం. లకు కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహం పార్టీ నేతలతో సమావేశంలో పాల్గొంటారు.

26న (బుధవారం) కార్యక్రమాలు . .

బుధవారం రోజు ఉ.10.30 గం. లకు – ఆర్ అండ్ బి అతిథి గృహం, కుప్పం – ప్రజా ఫిర్యాధుల స్వీకరణలో పాల్గొంటారు చంద్రబాబు. మ.12 గం. లకు – గవర్నమెంట్ డిగ్రీ కళాశాల (పి ఈ ఎస్ కళాశాల సమీపం లో), కుప్పం- నియోజకవర్గ పరిధి అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. మ.02.35 గం. లకు – పి ఈ ఎస్ మెడికల్ కాలేజీ – పార్టీ శ్రేణులతో మీటింగ్ ఉంటుంది. సా.4.10 – పి ఈ ఎస్ మెడికల్ కాలేజీ హెలిప్యాడ్, కుప్పం నుండి ముఖ్యమంత్రి తిరోగమనం చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version